ఖమ్మం: టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మంజిల్లా అధ్యక్షులుగా షేక్ అఫ్జల్ హసన్ ,కార్యదర్శిగా ఆర్.వి.ఎస్ సాగర్ లు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు గురువారం సూడా ఛైర్మెన్ విజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అధ్యక్ష,కార్యదర్శులతో పాటు కార్యవర్గం సభ్యులు విజయ్ కుమార్ ను కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు చుంచు వీర నారాయణ, టీఎన్జీవోస్ టౌన్ అధ్యక్షులు సామినేని రఘు, కార్యదర్శి ఎండీ. మజీద్,నాయకులు నందగిరి శ్రీను,ఎస్.జ్యోతి, అశ్విని,లక్ష్మీ..దాసరి రవి, కరణ్ సింగ్, ప్రసాద్, పిరంగి శ్రీను,నాగుల్ మీరా, నాగేందర్, భాస్కర్, రాజేష్, భాగం పవన్, సత్యనారాయణ, అబీబ్, అనుదీప్, బుద్ధ రామకృష్ణ, సిపిఎస్, ఔట్ సోర్సింగ్, టీఎస్ మెసా, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.