ఇల్లెందు రూరల్, డిసెంబర్ 25: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన చిన్నారి సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని భాగ్యనగర్ తండా గ్రా మానికి చెందిన వాంకుడోత్ కుమార్, ఆదివారం లచ్చగూ డెం నుంచి బైక్ మీద ఇల్లెందు కు వస్తున్నాడు. ఇల్లెం దు పట్టణానికి చెందిన రజిని, శ్రీనివా స్, ఏడాది వయసున్న పాప నిహారిక కలిసి బైక్పై మహబూబాబాద్ వెళ్తున్నారు.
కోటి లింగాల మూల మలుపు వద్ద ఈ రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. శ్రీనివా స్, రజిని, పాప నిహారికకు తీ వ్ర గాయాలయ్యాయి. వారిని 108 సిబ్బంది మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించారు.