ఖమ్మం వ్యవసాయం, జనవరి 18 : జిల్లాలో ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల అన్నారు. ఖమ్మం నగరంలోని పలు ఎరువుల దుకాణాలను ఖమ్మం డివిజన్ సహాయ సంచాలకుడు అజ్మీర శ్రీనివాసనాయక్తో కలిసి ఆమె గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నామన్నారు.
ఎరువుల దుకాణాల యజమానులు, డీలర్లు తప్పనిసరిగా పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రాల సహాయంతోనే ఎరువులను విక్రయించాలన్నారు. జిల్లాలోని పంటల సాగుకు అనుగుణంగా ఎరువుల నిల్వలు ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బన్ మండల వ్యవసాయ శాఖ అధికారి కిశోర్కు సూచించారు.