తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గురువారం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తుగా పూలపండుగను సంబురంగా జరుపుకున్నారు.
పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో చివరి రోజు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీరొక్క పూలతో రకరకాల ఆకృతులతో బతుకమ్మలను పేర్చారు.
విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మల వద్ద బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడి పాడారు. పాఠశాలల ఆవరణాలన్నీ పూలపండుగతో సందడి నెలకొంది. అనంతరం ఆయా బతుకమ్మలను కాల్వలు, చెరువులలో నిమజ్జనం చేశారు. – నమస్తే నెట్వర్క్