సారపాక, డిసెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నియోజకవర్గంలోని సోషల్ మీడియా వారియర్స్పై ఉందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడు యాంపాటి సందీప్రెడ్డి అధ్యక్షతన మణుగూరులోని వాసవీనగర్ గిరిజన భవన్లో గురువారం జరిగిన సోషల్ మీడియా విభాగ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ బలోపేతానికి సోషల్ మీడియా వారియర్స్ సైనికుల్లా పనిచేయాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉందన్నారు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ట్విట్టర్, వాట్సాప్ల వేదికగా సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేస్తూ ప్రజలకు చైతన్యం కల్పించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా వారియర్స్ కృషిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్పైనా, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రత్యర్థులు చేసే అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ విప్ రేగాను సోషల్ మీడియా బాధ్యులు గజమాలతో సత్కరించారు.
సారపాక/ ఆళ్లపల్లి, డిసెంబర్ 29: తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. ఆళ్లపల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాల వారు మణుగూరులోని వాసవీనగర్ గిరిజన భవన్ వద్ద ప్రభుత్వ విప్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు వారందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.