సత్తుపల్లి, నవంబర్ 1 : సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ కల్లూరులో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు గ్రామాల నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు, ద్విచక్రవాహనాల్లో నాయకులు, కార్యకర్తలు కల్లూరు వెళ్లారు. సభ ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. సభ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
వేంసూరు, నవంబర్1: కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద బుధవారం నిర్వహించిన ప్రజాశీర్వాద సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. వేంసూరు మండలం నుంచి బైకులు, డీసీఎంలు, బస్సులు, ఆటోల్లో తదితర వాహనాల్లో కల్లూరు చేరుకున్నారు.
తల్లాడ, నవంబర్1: నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ కల్లూరులో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే సండ్ర ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసేందుకు తల్లాడ నుంచి బీఆర్ఎస్ నాయకులు భారీగా తరలివెళ్లారు. ర్యాలీని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జీ.వీ.ఆర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు దూపాటి నరేశ్రాజు, బొడ్డు వెంకటేశ్వరరావు, గుండ్ల వెంకటి, గుండ్ల నాగయ్య, గుడిబండ్ల మహేశ్, శివ తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి, నవంబర్ 1 : కల్లూరు సభకు కొత్త కారాయిగూడెం నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు దండుగా కదిలారు. గ్రామంలో సర్పంచ్ దొడ్డపునేని శ్రీదేవి ఆధ్వర్యంలో వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లలో సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
పెనుబల్లి, నవంబర్ 1 : సీఎం కేసీఆర్పై కొండంత అభిమానంతో మహిళలు, ముస్ల్లింలు ఆయన్ను చూసేందుకు కల్లూరులో సీఎం బహిరంగ సభకు ఉత్సాహంగా తరలివచ్చారు. మాకు పింఛన్లు ఇస్తున్న పెద్దకొడుకు నా బిడ్డలకు కల్యాణలక్ష్మి అందిస్తున్న పెద్దన్న పండుటాకులకు అండగా ఉంటున్న కేసీఆర్ను కళ్లారా చూశామంటూ ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్పై అభిమానం వారి మాటల్లోనే….
ప్రతిరోజూ టీవీలో చూస్తున్నాం. నేడు ఆయన్ని కళ్లారా చూసే భాగ్యం కలిగింది. కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో చెన్నూరు నుంచి సభకు వచ్చాను. ఆయన్ను నేరుగా చూడటం.. ఆయన మాటలు ఆసక్తి వినడంతో రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని అనుకుంటున్నా. మళ్లీ కేసీఆరే రావాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్కే మా మద్ధతు.. కారు గుర్తుకే మా ఓటు. ఎన్నో మంచి పనులు చేసిండు..ఓటేసి మళ్లీ గెలిపిస్తే ఇంకా మరిన్ని పనులు చేస్తాడనే నమ్మకం ఉంది. ఆయనకు ఓటు వేయకపోతే బాగుండదు కదా… మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నా.
వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అండగా ఉంటూ ఆసరా పింఛన్లతో కొండంత ధైర్యం నింపుతున్న ఆ సారే మళ్లీ సీఎంగా రావాలని కోరుకుంటున్నాం. ఏదేమైనా కేసీఆర్ సార్కే మా మద్ధతు..ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే సండ్రకే మా ఓటు. బీఆర్ఎస్ ప్రభుత్వానిదే మళ్లీ అధికారం.
నాకు ఎకరంన్నర పొలం ఉంది. ఎకరంన్నరకు రూ.7.30వేల చొప్పున రెండు దఫాలుగా రైతుబంధు వస్తుంది. వీటితో పాటు నాకు వృద్ధాప్య పింఛన్ రూ.2వేలు వస్తుంది. ఇలాంటి ముఖ్యమంత్రి మళ్లీ రావాలి. కేసీఆర్కే ఓటేస్తాం… మళ్లీ అధికారంలోకి తెచ్చుకుంటాం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సారు రైతులకు అండగా నిలిచారు. నేడు అన్నదాతలు ఆనందంగా ఉన్నారంటే అది కేసీఆర్ చలువే. ఆయన చేపట్టిన పథకాలు చారిత్రాత్మకం. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలి… అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది.
నాకు ముగ్గురు కుమార్తెలు..ముగ్గురికీ వివాహం చేశాను. ప్రస్తుతం నాకు వృద్ధాప్య పింఛన్ రూ.2వేలు వస్తుంది. దొర కేసీఆర్ వల్లే బతుకుతున్నా. ఆయన పుణ్యమా అంటూ అన్నం తింటున్నా. కూతుళ్లు చూడటం లేదు. మళ్లీ కేసీఆర్ దొరగారు అధికారంలోకి వస్తే రూ.5వేలు పింఛన్ పెంచుతామంటున్నారు. ఇలాంటి నేత కేసీఆర్ చల్లంగుండాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన దగ్గరి నుంచి షాదీముబారక్ పేరున నా కుమార్తెకు మేనమామలా రూ.1,00,116లు ఇస్తున్నారు. మూడు నెలల క్రితం నా కూతురు పెళ్లి చేయడంతో ఎమ్మెల్యే సండ్ర చెక్కు అందించారు. కేసీఆర్ సారే సీఎంగా రావాలి.
నాకు డబుల్ బెడ్రూం ఇల్లు కేసీఆర్, ఎమ్మెల్యే సండ్ర పుణ్యాన వచ్చింది. రెండేళ్ల క్రితం భర్త కూడా చనిపోయారు. నా కుమార్తె వివాహం తర్వాత కల్యాణలక్ష్మి చెక్కు వచ్చింది. మరో కుమార్తె ఉంది. ఇల్లు వచ్చింది.. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎప్పుడూ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా. మళ్లీ సీఎంగా కేసీఆర్ సారే రావాలి.