ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 12 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజా రకం మిర్చి క్వింటా ధర రూ.22,300 పలికింది. మార్కెట్లో వారం రోజుల నుంచి మిర్చి ధర తగ్గుతూ.. పెరుగుతుండడంతో రైతులు సరుకును విక్రయానికి తరలించారు. జెండాపాట తర్వాత వచ్చిన మిర్చి బస్తాలను యార్డు బయటే రైతులు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఉదయం జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాకు రూ.22,300 పలకగా.. స్పల్పంగా రేటు పెరిగినైట్లెంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తేజా రకం మిర్చి గరిష్ఠ ధర క్వింటా రూ.22,300, మధ్య ధర క్వింటా రూ.20 వేలు, కనిష్ఠ ధర క్వింటాకు రూ.14 వేల చొప్పున నిర్ణయించి ఖరీదుదారులు కొనుగోలు చేశారు. తాలు రకం పంట గరిష్ఠ ధర క్వింటా రూ.12 వేలు పలికింది. సాయంత్రం వరకు యార్డులో క్రయవిక్రయాలతోపాటు కాంటాలు, తోలకాలు పూర్తయ్యాయి. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్కుమార్.. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ.అలీంతో కలిసి పర్యవేక్షణ చేశారు.