ఖమ్మం: ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా సూక్ష్మ పరిశీలన చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సాధారణ పరిశీలకులు సి . సుదర్శన్ రెడ్డి పేరొన్నారు. మంగళవారం డి.పి.ఆర్.సి భవనంలో సూక్ష్మ పరిశీలకులు( మైక్రో అల్బర్వర్స్)కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఎన్నికల అబ్జర్వర్ సి.సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్లకు వారు పలు సూచనలు చేసారు. సాధారణ పరిశీలకులు సి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేయాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ఉల్లంఘన, ఇతర ఎటువంటి సంఘటన దృష్టికి వచ్చిన వెంటనే ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారి, సెక్టోరల్ అధికారులకు సమాచారాన్ని అందించాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి ఎన్ . మధుసూదన్, శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ మైక్రో అబ్జర్వర్స్ నోడల్ అధికారి చంద్రశేఖర్, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, సర్వేల్యాండ్ రికార్డ్స్ ఎ.డి రాము, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు.