కూసుమంచి, మార్చి 30 : క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. గురువారం జీళ్లచెరువులో జాతీయ స్థాయి ఒంగోలు ఎద్దుల బండ లాగుడు పోటీలు, జాతీయస్థాయి మహిళా కబడ్డీ పోటీలను వారు ప్రారంభించారు. ఈ పోటీలను మూడు రోజులపాటు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటూరి శేఖర్ యూత్ నిర్వహించనున్నది. ఎమ్మెల్యే కందాళ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలకు ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు, మహిళా కబడ్డీ పోటీలు ప్రతీకలన్నారు.
ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ ఇలాంటి పోటీలు ఐక్యతను చాటుతాయన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ పోటీల్లో విజేతలే కాకుండా పరాజితులూ పట్టుదలతో ఆడాలని కోరారు.15 టన్నుల బండలాగుడు పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమరావతి, కుచనపల్లి, చుండూరు, పల్నాడురాజుపాలెం, తెలంగాణ నుంచి చితలపాలెం, నల్లగొండ జట్లు ఎద్దుల జంట పాల్గొన్నాయి. మహిళా కబడ్డీ పోటీలో తెలంగాణ, ఆంధ్రాచ మహారాష్ట్ర, హర్యానా, తమ్మిళనాడుతోపా టు ఇతర రాష్ర్టాల నుంచి జట్లు పాల్గొన్నాయి.
నిర్వాహకులు డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు మరికంటి ధనలక్ష్మీ, జడ్పీటీసీ ఇంటూరి బేబీ, రూరల్ జడ్పీటీసీ వరప్రసాద్, నేలకొండపల్లి ఎంపీపీ వజ్జా రమ్య, మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, పాషబోయిన వీరన్న, జీళ్లచెరువు సర్పంచ్ కొండా సత్యం, ఎంపీటీసీ ఉమ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఎద్దుల పోటీలకు రెఫ్రీగా రాధాకృష్ణ, కబడ్డీ పోటీలకు నేషనల్ రెఫ్రీ డాక్టర్ రామారావు వ్యవహరించారు. జీళ్లచెరువులో 50 ఏళ్లుగా ఆనవాయితీగా శ్రీరామనవమి సందర్భంగా నాటక ప్రదర్శన నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులోభాగంగా గురువారం గ్రామంలో అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో రౌడీ సింహాలు నాటకాన్ని ఏర్పాటు చేశారు.