అశ్వారావుపేట, మార్చి 11 : గెలల ధరలో వ్యత్యాసం నగదును పామాయిల్ రైతుల ఖాతాలో ఆయిల్ఫెడ్ అధికారులు సోమవారం జమ చేశారు. ఆయిల్ ఇయర్ ప్రకారం నవంబర్ నుంచి కొత్త ఓఈఆర్ ఆధారంగా గెలల ధర చెల్లించాల్సి ఉంది. అయితే నవంబర్ నుంచి కొత్త ఆయిల్ ఇయర్లో ఓఈఆర్ 19.17 ఉండగా.. జీవో విడుదలకు ఆలస్యం కావడంతో పాత ఓఈఆర్ 19.02 ఆధారంగా గెలల ధరను అధికారులు చెల్లించారు. అయితే కొత్త ఓఈఆర్ జీవో విడుదల కావడంతో గెలల ధరలో వ్యత్యాసం నగదును ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మొత్తం రూ.54,75,923.22లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయిల్ఫెడ్ జీఎం తూర్పు సుధాకర్రెడ్డి తెలిపారు. గత ఏడాది నవంబర్ నెలకుగాను 17,710.478 మెట్రిక్ టన్నుల ఆయిల్పాం గెలలను రైతులు ఫ్యాక్టరీకి తరలించారు.
కానీ.. ఈ నెలకు టన్ను గెలల ధర రూ.12, 525.36 ఉండగా.. రూ.12,440 చొప్పున రైతులకు చెల్లించారు. వ్యత్యాసం ధర టన్నుకు రూ.85.36 చొప్పున 17,710.478 టన్నులకు రూ.15,11,766.402, అలాగే డిసెంబర్ 8,533.470 మెట్రిక్ టన్నులకు రూ.12,533. 91లకు రూ.12,440 చొప్పున వ్యత్యాసం నగదును 93.91 చొప్పున రూ.8,01,378.1677 చెల్లించారు. జనవరిలో 5,051.544 మెట్రిక్ టన్నులకు ధర రూ.12,681. 32లకు గాను రూ.12,488 చొప్పున చెల్లించగా.. వ్యత్యాసం నగదు టన్నుకు రూ.233.32 చొప్పున రూ.11,78,626.246 చెల్లించారు. ఫిబ్రవరిలో 3,672.656 మెట్రిక్ టన్నులకు రూ.13,135లకుగాను రూ.12,595 చొప్పున రైతులకు చెల్లించారు. వ్యత్యాసం నగదు రూ.540.25 3,672.656 టన్నులకు రూ.19,84,152.404 నగదును రైతులకు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. నగదు జమ నిర్ధారణకు బ్యాంక్కు వెళ్లి సరిచూసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.