తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 28 : ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. తిరుమలాయపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్ను పరిశీలించడంతోపాటు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల కేంద్రాన్ని, ఆస్పత్రి థియేటర్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో వైద్య సేవల విస్తరణకు వైద్యులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించామన్నారు. నిరంతరం అందుబాటులో ఉంటూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా విధులు నిర్వర్తించాలన్నారు.కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.