ఖమ్మం, సెఫ్టెంబర్ 16 : ఖమ్మంలో కొందరు శిఖండి రాజకీయాలు చేస్తూ ఇకడ అభివృద్ధిని అడ్డుకుంటూ, నగరాన్ని మళ్లీ వెనకి నెట్టాలని తిరుగుతున్నారని, అలాంటి వాళ్లకు మనం దూరంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఖమ్మం నగరంలోని 12వ డివిజన్ నేతాజీనగర్లో చెరుకుమళ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ప్లీజ్ ఒకసారి చాన్స్ ఇవ్వండి అన్నందుకే కర్ణాటక రాష్ట్రం వెనకి పోయిందన్నారు. మనకు రాజకీయాలు, వ్యక్తులు అవసరం లేదని, అభివృద్ధి మాత్రమే కావాలని అన్నారు. ఖమ్మం నగరంలో అన్ని ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. నగరాన్ని నలుదికులా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే దీనికి కారణమన్నారు. రూ.690 కోట్లతో మున్నేరుకు ఇరువైపులా త్వరలో నిర్మించనున్న ఆర్సీసీ రక్షణ గోడలతో శాశ్వత పరిషారం లభిస్తుందన్నారు. రూ.180 కోట్లతో హైదరాబాద్ దుర్గంచెరువు మాదిరి నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జితో త్రీ టౌన్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ చిరుమామిళ్ళ లక్ష్మీనాగేశ్వరరావు, వల్లభనేని రామారావు, చెరుకుమళ్ల శ్రీనివాస్, దుద్దుకూరి సత్యనారాయణ, తుమ్మలపల్లి నాగేశ్వరరావు, వీరయ్య బాబు, మోతూరి సత్యనారాయణ, గుర్రం భద్రం, దిరిశాల వెంకటేశ్వర్లు, వనమా లక్ష్మణ్రావు, రజనీ, భారతి ఉన్నారు.
విత్తనాలతో గణపతి ప్రతిమల పంపిణీ
సకల ఆపదల నుంచి రక్షించమని గణపతికి విత్తన(అంకుర గణపతి) రూపంలో పూజలు చేయడం శుభ పరిణామమని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో రూపొందించిన విత్తన గణపతి ప్రతిమలను శనివారం నగరంలోని క్యాంప్ కార్యాలయంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానవాళి ఎదురొంటున్న అతిపెద్ద సవాల్ కాలుష్యమని, దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతిఒకరిపై ఉందన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలనే వాడాలని కోరారు. విత్తన గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రోజువారీ పూజలు అందుకునే ఈ గణేశునిలోని విత్తనం ఐదు నుంచి ఏడు రోజుల్లో మొలకెత్తుతుందని, మరో వారంలో పూర్తిస్థాయి మొకగా మారుతుందన్నారు. ఇంట్లోనే విగ్రహ నిమజ్జనం తర్వాత ఈ వేప మొకను అందరూ తమ ఆవరణల్లో నాటుకోవచ్చుని సూచించారు. కల్వొడ్డు బతుకమ్మ ఘాట్ను రూ.690 కోట్లతో వచ్చే ఏడాది నాటికి సుదరంగా తయారు చేయనున్నట్లు తెలిపారు.
పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
స్తంభాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించే మండపాలకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పోలీస్ పర్మిషన్, విద్యుత్ చార్జీలు అందిస్తున్నామని మంత్రి పువ్వాడ తెలిపారు. రూ.4 లక్షల చెకును విద్యుత్ ఎస్ఈ సురేందర్కి అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, కొత్తపల్లి నీరజ, దండా జ్యోతిరెడ్డి, కూరాకుల వలరాజు, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పగడాల నాగరాజు, రైస్మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, బత్తుల మురళి, స్తంభాద్రి ఉత్సవ సమితి నిర్వాహకులు గెట్యాల విద్యా సాగర్, కన్నం ప్రసన్నకృష్ణా, ములగుండ్ల శ్రీహరి, మాజీ మారెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, సాయి, కొల్లు పద్మ, ఆకుల మూర్తి, షకీన, విద్యుత్ ఏడీఈ రమేశ్ పాల్గొన్నారు.