‘తెలి మంచు కరిగిందీ తలుపు తీయనా ప్రభూ..’ అన్నారు ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘స్వాతికిరణం’ సినిమాలో గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. తాజా మంచు దుప్పట్లను గనుక ఆయన చూసి ఉండుంటే ‘తెల్లవారిపోయినా తెలి మంచు కరగదేమి ప్రభూ..’ అనే వారేమో. ఆయన చెప్పినట్లుగానే తెలి మంచుకు ఇల గొంతు వణుకుతూనే ఉంది.
ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతుండడంతో చలి తీవ్రత కూడా క్రమంగా పెరిగిపోతోంది. తెల్లవారి ఎనిమిది గంటలు దాటినా మంచు తెరలు తొలగిపోవడం లేదు. వేకువజాము మంచు బిందువులు కొంత ఆహ్లాదాన్ని కలిగించినా.. వాహనదారులకు మాత్రం కొంచెం అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. మొత్తంగా సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి, చర్ల మండలాల్లో మంగళవారం ఉదయం కురిసిన హిమబిందువులు హిమసీమలను తలపించాయి.