HomeKhammamThe Incident Where The Wife Killed Her Husband Along With Her Boyfriend
ప్రియుడితో కలిసి భర్తను హత్య
వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భార్య భర్తను హతమార్చిన ఘటన ఆదివారం కొత్తగూడెం పట్టణంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి.. పట్టణంలోని సన్యాసి బస్తీకి చెందిన గాయపాక ప్రవీణ్(32) అదే బస్తీకి చెందిన లావణ్య ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసున్నారు.
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం కొత్తగూడెం సన్యాసి బస్తీలో ఘటన.. పరారీలో నిందితులు
కొత్తగూడెం క్రైం, మార్చి 19 : వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భార్య భర్తను హతమార్చిన ఘటన ఆదివారం కొత్తగూడెం పట్టణంలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నా యి.. పట్టణంలోని సన్యాసి బస్తీకి చెందిన గాయపాక ప్రవీణ్(32) అదే బస్తీకి చెందిన లావణ్య ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసున్నారు. పెళ్లి అయిన కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. 2021లో పెద్దల సమక్షంలో పంచాయతీ జరగ్గా లావణ్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో లావణ్య తన ఇంటి సమీపంలో ఉంటున్న తంగెళ్ల సుమంత్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. విషయం తెలుసుకున్న ప్రవీణ్ లావణ్యతో పలుమార్లు గొడవ పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రవీణ్ తన భార్య ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. అప్పటికే భర్త అడ్డు తొలగించుకుందామని సుమంత్తో కలిసి వేసుకున్న పథకం ప్రకారం లావణ్య ప్రవీణ్పై ఇనుప రాడ్లతో దాడి చేసి బండరాయితో మోదారు. గమనించిన స్థానికులు అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రవీణ్ను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న వన్టౌన్ ఇన్చార్జ్ ఎస్హెచ్వో లావుడ్యా రాజు, ఎస్సై నర్సిరెడ్డి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. లావణ్య, సుమంత్ పరారీలో ఉన్నారని, వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయని ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.