కొత్తగూడెం సింగరేణి, డిసెంబర్ 27 : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సంస్థ వ్యాప్తంగా బుధవారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 39,773 మంది కార్మికులకు గాను 37,468 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 94.20 శాతం పోలింగ్శాతంగా నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. కార్మికులు స్వచ్ఛందంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం ఏరియా రీజియన్ పరిధిలోని కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, ఇతర కార్మిక సంఘాల నాయకులు పోలింగ్బూత్ల సమీపంలో టెంట్లు ఏర్పాటు చేసుకొని ప్రచారం చేశారు. కొత్తగూడెం కార్పొరేట్లో 1,191 మంది కార్మికులకు 1,149 మంది తమ ఓటువేశారు. ఈ ఎన్నికల ప్రక్రియను రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు.
మణుగూరుటౌన్, డిసెంబర్ 27 : మణుగూరు ఏరియాలో బుధవారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 97 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. 7 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 2,450 మంది సింగరేణి ఉద్యోగులకు.. 2,378 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా ఉద్యోగులు వివిధ కారణాలతో ఓటింగ్లో పాల్గొనలేదని తెలిపారు.
రామవరం, డిసెంబర్ 27 : రామవరం ఏరియాలో మొత్తంలో 6 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,326 మందికి 2,207 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 94.9 పోలింగ్ శాతం నమోదైంది. పీవీకే 5 ఇైంక్లెన్ ఏజెంట్ ఆఫీస్ పోలింగ్కేంద్రంలో 566 మందికి 536 మంది ఓటువేశారు. జీకేవోసీ క్యాంటీన్ హాల్లో 238 మందికి 225, జేవీఆర్వోసీ టూ రెస్ట్ హాల్లో 613 మందికి 579, జేవీఆర్ సీహెచ్పీ కాన్ఫరెన్స్హాల్లో 240 మందికి 228, కిష్టారం వీటీసీ హాల్లో 137 మందికి 130, ఏరియా వర్క్షాప్లో 532 మందికి 509 మంది ఓటు వేశారు. గుర్తింపుకార్డులను తీసుకొచ్చిన కార్మికులనే ఓట్లు వేయించారు. ఐడీకార్డులు లేనివారికి పోలింగ్స్టేషన్ల వద్ద తాత్కాలిక ఐడెంటీ కార్డులను ఏర్పాటు చేశారు. టూ టౌన్ సీఐ రమేశ్కుమార్, ఎస్సై జుబేదా, శ్రీనివాస్, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
టేకులపల్లి, డిసెంబర్ 27 : టేకులపల్లి మండలం ఇల్లెందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో సింగరేణి ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. కేవోసీలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్లో మొత్తం 122 మంది ఓటర్లకు.. 118 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేవోసీలో పోలింగ్ 97 శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిశీలించారు. కార్యక్రమంలో వివిధ సంఘల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
సత్తుపల్లి, డిసెంబర్ 27 : సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ, సీహెచ్పీలలో 94.6 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 990 ఓట్లకు.. 937 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సత్తుపల్లిలోని మూడు ప్రాంతాల్లో అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. జేవీఆర్ ఓసీ పీవో వెంకటాచారి, కల్లూరు ఆర్డీవో అశోక్చక్రవర్తి, ఏసీపీ రామానుజం ఎన్నికలను పర్యవేక్షించారు. సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీలో 613 ఓట్లకు.. 579, కిష్టారం ఓసీలో 240 ఓట్లకు.. 228, సీహెచ్పీలో 137 ఓట్లకు.. 130 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి పోలింగ్ కేంద్రాలను సందర్శించి.. ఐఎన్టీయూసీ నాయకులతో మాట్లాడి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఏసీపీ రామానుజం ఆధ్వర్యంలో సీఐలు మోహన్బాబు, హనూక్లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ)/ కొత్తగూడెం సింగరేణి: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం అర్ధరాత్రి ముగిసింది. కొత్తగూడెంలో ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో గెలుపు ఐఎన్టీయూసీని వరించింది.
కొత్తగూడెం కార్పొరేట్లో.. 549 253 286
కొత్తగూడెం ఏరియా 1129 896 233
ఇల్లెందు ఏరియా 310 264 46
మణుగూరు ఏరియా 778 776 2