మామిళ్లగూడెం, ఫిబ్రవరి 14: బదిలీపై జిల్లాకు వచ్చిన పలువురు ఉన్నతాధికారులు బుధవారం తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. డీఆర్డీవోగా సన్యాసయ్య, జిల్లా సంక్షేమాధికారిగా రాంగోపాల్రెడ్డి, జడ్పీ సీఈవోగా వినోద్, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి నూతనంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో కూడా జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజును కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
రఘునాథపాలెం, ఫిబ్రవరి 14: ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారిగా ఆఫ్రీన్ సిద్దిఖ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీటీవోగా ఉన్న మహ్మద్ గౌస్పాషా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో డీటీవోగా విధులు నిర్వహిస్తున్న ఆఫ్రీన్ సిద్దిక్.. ఖమ్మం రెగ్యులర్ డీటీవోగా రానున్నారు. దీంతో ప్రస్తుత ఇన్చార్జి డీటీవో మహ్మద్ గౌస్పాషా.. మహబూబాబాద్ డీటీవోగా వెళ్లనున్నారు.
మామిళ్లగూడెం, ఫిబ్రవరి 14 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న పలువురు ఏసీపీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం టౌన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న ఎస్వీ.హరికృష్ణను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగానికి బదిలీ చేశారు. ఇల్లెందు డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్వీ రమణమూర్తిని ఖమ్మం ఏసీపీగా నియమించారు. ఖమ్మం రూరల్ ఏసీపీగా పని చేస్తున్న బస్వారెడ్డిని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు బదిలీ చేస్తూ.. ఆయన స్థానంలో మంచిర్యాల ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న బి.తిరుపతిరెడ్డిని నియమించారు. ఖమ్మం సీటీసీ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న టి.కృపాకర్ను సికింద్రాబాద్ డీఎస్ఆర్పీకి బదిలీ చేశారు.
ఎక్సైజ్ ఎండ్ ప్రొహిబిషనరీ శాఖలో పని చేస్తున్న పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్లో పని చేస్తున్న ఎన్.అనిల్ను ఖిలా వరంగల్ స్టేషన్కు బదిలీ చేశారు. వైరా స్టేషన్లో పని చేస్తున్న ఎతినేని మమతను కాజీపేట స్టేషన్కు బదిలీ చేశారు. వైరాలో పని చేస్తున్న రామిశెట్టి కీర్తిని మహబూబాబాద్ జిల్లా టాస్క్ఫోర్స్కు బదిలీ చేశారు. వీరి స్థానంలో భద్రాచలం సీపీలో పని చేస్తున్న ఎన్.రత్నప్రసాద్రెడ్డి, మంథనిలో పని చేస్తున్న ఎం.సాయిరామ్లను బదిలీ చేశారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్-1లో పని చేస్తున్న ఎస్కే రబ్బానీని భూపాలపల్లి స్టేషన్కు పంపించారు. ఆయన స్థానంలో మెట్పల్లిలో పని చేస్తున్న కె.సాయిబాబాను నియమించారు. సిరిసిల్లలో పని చేస్తున్న ఎం.శేఖర్ను సత్తుపల్లికి బదిలీ చేశారు. నేలకొండపల్లిలో పని చేస్తున్న పెంచల సందీప్రావును మెట్పల్లికి, బొంతల శంకర్ను మంచిర్యాలకు బదిలీ చేశారు. సింగరేణిలో పని చేస్తున్న బీర వెంకటరమణను మంచిర్యాలకు బదిలీ చేశారు. సత్తుపల్లిలో పని చేస్తున్న ఎం.వెంకటేశ్ను బెల్లంపల్లికి బదిలీ చేశారు.