ఖమ్మం:జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీ సీఆర్టీ పోస్టులను తాత్కాలిక పద్దతిన నియామక ప్రక్రియ నిర్వహించారు. ఆయా సబ్జెక్ట్లలో అర్హత ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన భర్తి చేశారు. ఎంపికైన అధ్యాపకులు మంగళవారం విధుల్లో చేరారు. మెరిట్లో ఉండి విధుల్లో చేరకుండా ఉన్నవారి స్ధానంలో తర్వాత మెరిట్ ఆధారంగా భర్తి చేయనున్నారు. విధుల్లో చేరిన అధ్యాపకులకు సంబంధిత కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లు సబ్జెక్ట్లు కేటాయించడంతో పాటు విధులపై అవగాహన కల్పించారు.