పల్లెప్రగతి కార్యక్రమంలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
బోనకల్లు, జూన్ 9: తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని రాపల్లె, రావినూతల, రామాపురం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. రోడ్ల వెంట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పల్లెలన్నింటినీ పచ్చని తోరణాలు తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా పల్లెప్రగతి కార్యక్రమాలు చేపట్టడంతో గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కారమయ్యాని అన్నారు.
అందుకే నేడు పల్లెలన్నీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు కంకనాల సౌభాగ్యం, శ్రీదేవి, మందడపు తిరుమలరావు, కొమ్మినేని ఉపేందర్, తొండపు వేణు, చేబ్రోలు మల్లికార్జున, వేమూరి ప్రసాద్, బంధం శ్రీనివాసరావు, కాకాని శ్రీనివాసరావు, ఇటికాల శ్రీనివాసరావు, యనగండ్ల మురళి, సాదినేని శ్రీనివాసరావు, కల్యాణపు నాగేశ్వరరావు, పెనుగొండ ఏడుకొండలు, ఉద్దండు, తమ్మారపు వెంకటేశ్వర్లు, ముడావత్ సైదా, కందిమళ్ల రాధ, ముక్కపాటి అప్పారావు, కొనకంచి నాగరాజు, యార్లగడ్డ రాఘవ, బొమ్మకంటి సైదులు, బోయినపల్లి కొండ, బంధం తిరుపతి, జలాలుద్దీన్ పాల్గొన్నారు.