ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 23: మహిళలు మరింత స్వేచ్ఛగా, నిర్భయంగా పోలీస్స్టేషన్లకు చేరుకోగిలిగేలా చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టిన తెలంగాణ పోలీసు శాఖ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఉమెన్ సేప్టీ వింగ్ అడిషనల్ ఎస్పీ రాంకుమార్ తెలిపారు. నగరంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న ఉమెన్ హెల్ప్ డెస్క్ శిక్షణ కార్యక్రమానికి రెండో రోజు బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోలీస్ అధికారులు, రిసిప్సెన్ సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ పోలీసులంటే అపోహలు పోగొట్టేందుకు వీలుగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ మహిళా సిబ్బందితో కూడిన మహళా హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పడానికి, న్యాయసహాయం, కౌన్సెలింగ్ అందించడానికి, ఆశ్రయం, పునరావాసం కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సీసీఆర్బీ ఏసీపీ వెంకటస్వామి, సీఐ నరేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.