సారపాక, నవంబర్ 24: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణను నెంబర్వన్గా ఉంచాలన్నదే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సారపాకలో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్లో యువకుల చేరికల సభలో ఆయన మాట్లాడారు. యువత సేవాభావం కలిగి ఉండి రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
యువత తలుచుకుంటే దేనినైనా సాధించగలరని అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. ఈ పథకాలకు వివిధ వర్గాల ప్రజలతోపాటు యువకులూ ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కూడా వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని, మోసపూరిత మాటలు వినే పరిస్థితిలో లేరని అన్నారు.
దళితబంధు పథకంతో ఎస్సీల జీవితాల్లో వెలుగులు నిండాయని, ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కామిరెడ్డి శ్రీలత, ముత్యాలమ్మ, బిక్కసాని శ్రీనివాసరావు, గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, గోనెల నాని, ఎడమకంటి సుధాకర్రెడ్డి, పూర్ణ, లక్ష్మీచైతన్యరెడ్డి, కొనకంచి శ్రీనివాసరావు, బెజ్జంకి కనకాచారి, ఏసోబు, గుల్ మహ్మద్, బానోతు శ్రీను, చుక్కపల్లి బాలాజీ, బిట్రా సాయిబాబు, బాలి శ్రీహరి, బొబ్బిలి తదితరలు పాల్గొన్నారు.
సారపాకకు వస్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు తొలుత బీఆర్ఎస్ మండల కమిటీ, యువజన కమిటీల ఆధ్వర్యంలో మణుగూరు – భద్రాచలం క్రాస్రోడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ బైక్ ర్యాలీగా సారపాక చేరుకున్నారు. అనంతరం సారపాకలోని వాసవీ ఫంక్షన్హాల్ వద్ద సారపాకలో పలు కాలనీలకు చెందిన సుమారు 150 మంది యువకులు ప్రభుత్వ విప్ రేగా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
in all fields