కూసుమంచి, ఫిబ్రవరి 1 : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేదలకు అందిస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణా ముందుకు పోతున్నదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో నాయకన్గూడెంకు చెందిన ముదిరాజు సంఘం అధ్యక్షుడు మరిపెద్ది రాంబాబు, పలువురు బుధవారం వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత చేపడుతున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, నాయకులు వేముల వీరయ్య, ఆసిఫ్ పాషా, కాసాని సైదులు, చాట్ల పరుశురాం, మల్లీడి వెంకటేశ్వర్లు, కిన్నెర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా దేవత విగ్రహాల ప్రతిష్ఠ
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 1: మండలంలోని సీతారాంపురం గ్రామ కోదంండ రామాలయంలో సీతారామచంద్రస్వామి, ఆంజనేయస్వామి, గ్రామదేవతలు, విఘ్నేశ్వరస్వామి, సాయిబాబ, వేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠతో పాటు గ్రామ కూడలిలో బొడ్రాయి. కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ద్వజస్తంభం ప్రతిష్ఠ జరిగింది. భక్తులు, దేవతామూర్తుల విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంపీపీ బెల్లం ఉమ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ దంపతులు గ్రామ పెద్దలతో కలిసి సమీక్షించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి-విజయమ్మ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సుడా డైరక్టర్ గూడా సంజీవరెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
జాతర పనులు వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 1: మహాశివరాత్రి జాతర పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే దంపతులు తీర్థాల సంఘమేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్ పర్సన్ జాటోత్ శాంత, సర్పంచ్ బాలునాయ స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, రైతుబంధుసమితి కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న, సుడా డైరక్టర్ గూడా సంజీవరెడ్డి, నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, ముత్యం కృష్ణారావు, లక్ష్మణ్నాయక్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 18న జరిగే మహాశివరాత్రికి ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నూతన కమిటీకి సభ్యులకు సూచించారు. కూసుమంచిలోని పురాతన కాకతీయుల నాటి శివాలయానికి నూతన పాలకవర్గానికి ఏడుగురు సభ్యులను ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సిఫార్సు మేరకు నియమించారు.
అర్హులకు ఇళ్ల స్థలాలు
తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 1 : అర్హులైన పేదలకు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తెలిపారు. పేదలకు ఇళ్ల స్థలం పట్టాలను మండల కార్యాలయంలో బుధవారం పంపిణి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేసి మాట్లాడారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బోడ మంగీలాల్, తహసీల్దారు పుల్లయ్య, ఎంపీడీవో జయరామ్, పలువురు ప్రజాప్రతినిధలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రాజారంలో ఇటీవల మృతిచెందిన సామా మల్లారెడ్డి దశదిన కర్మల్లో పాల్గొని నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న తదితరులు పాల్గొన్నారు.
సీతారావమ్మకు ఎమ్మెల్యే నివాళి
కూసుమంచి రూరల్, ఫిబ్రవరి1: గట్టుసింగారంలో ఇటీవల మృతి చెందిన నెల్లూరి సీతారావమ్మ చిత్రపటం వద్ద ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి బుధవారం నివాళి అర్పించారు. మృతురాలి కుమారుడు బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నెల్లూరి వీరభద్రంను పరామర్శించారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నం బ్రహ్మయ్య, ఆసిఫ్పాషా, చాట్ల పరుశురామ్, షేక్ అలీ, వాకా సుధారాణి తదితరులు ఉన్నారు.