వైరా రూరల్, నవంబర్ 7: కాంగ్రెస్, బీజేపీలవి కట్టు కథలేనిన వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రజలెవరూ మాటి మాటలను విశ్వసించడం లేదని తేల్చిచెప్పా రు. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. వైరా మండలంలో మంగళవారం పర్యటించిన ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్తో కలిసి లక్ష్మీపురం, ముసలిమడుగు, కొండకొడిమ, ఖానాపురం, గోవిందాపురం, గన్నవరం, దా చాపురం, గరికపాడు, లింగన్నపాలెం గ్రామాల్లో విస్తృతం గా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. రైతుబంధు, దళితబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు వంటి పథకాలు అర్హులందరికీ అందాయని అన్నారు. ఇలాంటి మరెన్నో పథకాలను అమలు చేయడం లో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందుందని అన్నా రు. ఇప్పుడు 24 గంటలూ అందుతున్న నాణ్యమైన విద్యుత్తో రైతులు సమృద్ధి పంటలు సాగు చేసుకుంటున్నారని అన్నారు. కానీ గత కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని విమర్శించారు.
ఇతర రాష్ర్టాల కూలీలు కూడా ఇక్కడికి వలస వచ్చి వ్యవసాయ పనులు చేస్తుండడం తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్ మట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలే తన బలమని, తన ధైర్యమని స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆదరించాలని కోరారు. కారు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ముళ్లపాటి సీతారాములు, కట్టా కృష్ణార్జున్రావు, పసుపులేటి మోహన్రావు, డాక్టర్ కాపా మురళీకృష్ణ, వనమా చిన్ని, మేదరమెట్ల శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, మోరంపూడి ప్రసాద్, వేల్పుల పావని, నంబూరి కనకదుర్గ, లాల్మహ్మద్, మాదినేని సునీత, డాక్టర్ దారెల్లి కోటయ్య, తన్నీరు జ్యోతి, బాణాల వెంకటేశ్వర్లు, మద్దెల రవి, కొత్తా వెంకటేశ్వరరావు, మాదినేని దుర్గాప్రసాద్, ఏదునూరు శ్రీనివాసరావు, మరికంటి శివ, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, మేడూరి రామారావు, దొంతెబోయిన గోపి, తన్నీరు కిశోర్, ఆదూరి ప్రేమ్కుమార్, గుజ్జర్లపూడి దేవరాజు, మాదినేని లక్ష్మణ్, యండ్రాతి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.