ఖమ్మం రూరల్, మే 19 : మార్క్సిస్ట్ యోధుడు,,దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పని చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం, కాచిరాజుగూడెం, గుదిమళ్ల, తెల్దారుపల్లి, మద్దులపల్లి, పొన్నెకల్లు, తల్లంపాడు, ఎం.వెంకటాయపాలెం, అరేంపుల గ్రామాల్లో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో పోతినేని మాట్లాడుతూ… ఉన్నత కుటుంబంలో పుట్టి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయుడు సుందరయ్య అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని సుందరయ్య లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని కుల, మత రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుగ్గవీటి సరళ, సీనియర్ నాయకులు మామిండ్ల సంజీవరెడ్డి, సిద్దినేని కోటయ్య, బత్తినేని వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్, షేక్ బషీరుద్దీన్, మండల నాయకులు పి.మోహన్ రావు, పి.సంగయ్య, నందిగామ కృష్ణ, వడ్లమూడి నాగేశ్వరరావు, తోట పెద్ద వెంకట్రెడ్డి, వై.ప్రసాద్ రావు, పొన్నం వెంకటరమణ, పల్లె శ్రీనివాసరావు, యామిని ఉపేందర్, పెండ్యాల సుమతీ, వరగాని మోహన్ రావు, కోటి శ్రీనివాస్, పెంట్యాల నాగేశ్వరరావు, అద్దంకి తిరుమలయ్య, పొన్నం మురళి, భాస్కరరావు, మడిపల్లి వెంకన్న, రాజశేఖర్, గాయత్రీ, యండపల్లి వెంకటరామయ్య, సీతారాం రెడ్డి, మద్ది వెంకటరెడ్డి పాల్గొన్నారు.