రఘునాథపాలెం/ మామిళ్లగూడెం, జూన్ 19: మనిషి మనుగడ చెట్లతోనే ఆధారపడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. హరితోత్సవంలో భాగంగా ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గోపాలపురం ఎన్నెస్పీ కాలువ కట్టపై పెద్ద ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి మంత్రి పువ్వాడ ముఖ్య అతిథిగా హాజరై మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. మేయర్ పునకొల్లు నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు వాంకుడోతు సురేశ్, కార్పొరేటర్ సైదులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది వేడుకల్లో భాగంగా హరితోత్సవం కార్యక్రమం సోమవారం మండలంలోని అన్ని గ్రామాల్లో సందడిగా కొనసాగింది. ఊరూరా వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, ప్రభుత్వ పాఠశాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యలయాల నుంచి నర్సరీల వరకు హరితోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రాంతాల్లో సోమవారం హరితోత్సవం జరిగింది. ఐడీవోసీలో కలెక్టర్ వీపీ గౌతమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా మొకలు నాటారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పరందామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మేయర్ నీరజ, కార్పొరేటర్ లక్ష్మి కలిసి మొకలు నాటారు. ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయంలో కమిషనర్ మొక నాటారు.