ఖమ్మం :రాష్ట్ర గొర్రెల,మేకల అభివృద్ది సంస్థ చైర్మన్గా ఎన్నికైన దూదిమెట్ల బాలరాజుకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని జిల్లా డీసీసీబీ డైరక్టర్, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షుడు మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. గురువారం హైదరబాద్లో జరిగిన బాలరాజు ప్రమాణాస్వీకార కార్యక్రమానికి మల్లిబాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా దూదిమెట్లను శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బాలరాజు చేసిన పోరాటం మరువలేనిదన్నారు.
ఉన్నత చదువులు చదివిన బాలరాజు ఉద్యమ సమయంలో జైలు పాలైన సంగతి గుర్తు చేశారు. వైద్య విద్యను అభ్యసించిన బాలరాజుకు తెలంగాణ ప్రభుత్వం తగిన రీతిలో గౌరవించిందన్నారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాతనే గొల్ల, కురుమలకు న్యాయం జరిగిందన్నారు. కులవృత్తులకు జీవం పోసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందన్నారు.