ఖమ్మం:ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ప్రోగాం అధికారి డాక్టర్ జయరాం రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని పెద్దాసుపత్రి సందర్శనకు వచ్చిన ఆయన రికార్డులను తనిఖీ చేశారు. అవుట్ పేషంట్ , ఇన్పేషంట్, ఇతర పాలనాపరమైన నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిల్లోని వైద్య విధాన పరిషత్ యంత్రాంగం చిత్తశుద్దితో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ బీ. వెంకటేశ్వర్లు, వైద్యులు డాక్టర్ రాజశేఖర్, ఏవో ఆర్వీఎస్ సాగర్, డైటీషియర్ మేరీ తదితరులు పాల్గొన్నారు.