పాల్వంచ, డిసెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలు ప్రతీ పేదవారికి అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు గాంధీనగర్లో శుక్రవారం జరిగిన ప్రజా పాలన వార్డు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పేదల స్థితిగతులు మారతాయని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి పైరవీలకు తావుండబోదని, ప్రజలు నేరుగా అధికారులను సంప్రదించి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వామి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ డీఈ, ఏఈ, శానిటరీ ఇన్స్పెక్టర్, సీపీఐ నాయకులు ముత్యాల విశ్వనాథం, వీసంశెట్టి పూర్ణచందర్రావు, ఉప్పుశెట్టి రాహుల్, గుండాల నాగరాజు, అన్నారపు వెంకటేశ్వర్లు, ఎస్కే పాషా, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.