కూసుమంచి: కూసుమంచిలోని కాకతీయుల నాటి శివాలయంలో స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ పీయూష్ ఆయన సతీమణి నేహా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం నుంచి హైద్రాబాద్ వెళుతూ కూసుమంచిలోని శివాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా పీయూష్ అర్చకులు దేవులపల్లి శేషగిరి శర్మను ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. కాకతీయలు నిర్మించిన ఈ ఆలయం శివభక్తికి తార్కాణంగా నిలుస్తోందని పేర్కొన్నారు.