మామిళ్లగూడెం, ఫిబ్రవరి 13 : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకున్న వారి దరఖాస్తుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు. మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఎమ్మెల్సీ ఓటరు నమోదు, రెవెన్యూ సంబంధ అంశాలపై ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఎల్వో, ఏఈఆర్వోల లాగిన్ నుంచి దరఖాస్తుల నమోదు ప్రక్రియను చేపట్టాలన్నారు. మండలాల్లో వివిధ పనులకు సంబంధించి స్లాట్ పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. బల్క్ సమస్యలు, డొంక రహదారులు, పెండింగ్ కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ, రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఈ-కేవైసీ ప్రక్రియ వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.