ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి.ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో అక్షరాభ్యాసం, సామూహిక ఛండీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసశర్మ, ఆలయ పర్యవేక్షకులు బీ.శ్రీనివాస్, ధర్మకర్త కృష్ణమోహనశర్మ, కార్యనిర్వహణాధికారి కే.జగన్మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.