సత్తుపల్లి : మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని మునిసిపల్ కూసంపూడి మహేష్ అన్నారు. మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం పలు వార్డుల్లో దోమలమందు పిచికారీ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ప్రతి వార్డులో దోమలనివారణకు మందు పిచికారీ, డ్రైన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించి బ్లీచింగ్ చల్లి శుభ్రంగా ఉంచుతున్నామని అన్నారు. ప్రజలు కూడా సహకరించి తమ ఇంట్లోని చెత్తను ఇంటి వద్దకు వచ్చే రిక్షాల్లో వేయాలని, రోడ్లపై చెత్తవేయకుండా సహకరించాలని కోరారు.