బూర్గంపహాడ్, జనవరి 27: సీఎం కేసీఆర్ వల్లనే గ్రామాల్లో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. బూర్గంపహాడ్ మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. రూ.1.25 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఉప్పుసాక, పినపాక పట్టీనగర్, జింకలగూడెం, మోరంపల్లిబంజర, నకిరిపేట, గోపాలపురం, టేకులచెరువు, లక్ష్మీపురం, ముసలిమడుగు, కృష్ణసాగర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కొన్నిచోట్ల గ్రావెల్ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తోందని అన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం త్వరలోనే ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు భగవాన్రెడ్డి, వివేక్రామ్, వెంకటేశ్వర్లు, సునీల్శర్మ, కామిరెడ్డి శ్రీలత, బిక్కసాని శ్రీనివాసరావు, గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీశ్, వల్లూరిపల్లి వంశీకృష్ణ, పాయం వెంకటేశ్వర్లు, పరమేశ్వరి, భూక్యా భారతి, భూక్యా దివ్యశ్రీ, సోంపాక నాగమణి, భూక్యా సుజాత, వెంకటేశ్వర్లు, కుర్సం వెంకటరమణ, కొర్సా వెంకటేశ్వర్లు, జక్కం సుబ్రమణ్యం, కామిరెడ్డి రామకొండారెడ్డి, సాబీర్పాషా, తోటమళ్ల సరిత, తోటమళ్ల భిక్షం, కైపు సుబ్బిరామిరెడ్డి, ఎక్కంటి శ్రీనివాసరెడ్డి, కైపు లక్ష్మీనారాయణరెడ్డి, కొనకంచి శ్రీను, కురుకుంట్ల చిన్నపరెడ్డి, బొర్రా రాఘువులు, పొడియం నరేంద్ర, పూర్ణ, సోము లక్ష్మీచైతన్యరెడ్డి, బాలాజీ, ఆంజనేయులు, బాలి శ్రీహరి, గుల్మహ్మద్, తిరుపతి ఏసోబు, చేతుల వీర్రాజు పాల్గొన్నారు.
రెడ్డిపాలెం గ్రామ అధ్యక్షుడిగా మేడగం
సారపాక, జనవరి 27: బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మేడగం శ్రీనివాసరెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు నియమించారు. గ్రామంలో పార్టీ బలోపేతానికి మరింత కృషిచేయాలని సూచించారు.