రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకల్లో వక్తలు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలు ఆచరణీయమైనవని వక్తలు పేర్కొన్నారు. వాటిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ జయంతి సందర్భంగా ప్రభుత్వ శాఖలు, వివిధ పార్టీలు, పలు సంఘాలు, విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంబేద్కర్ మేధస్సును కొనియాడారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికీ సమాన హక్కులు లభించాయని గుర్తుచేశారు. కాగా, ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్లలో కలెక్టర్లు అనుదీప్, అంకిత్; సత్తుపల్లి, ఇల్లెందుల్లో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియ; మధిరలో ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు; ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, ఖమర్ తదితరులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను కీర్తించారు.
-నమస్తే నెట్వర్క్, ఏప్రిల్ 14