మామిళ్లగూడెం, ఫిబ్రవరి 29: వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో నూతన కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రామలింగేశ్వరస్వామి దేవాలయం 5.28 ఎకరాల్లో విస్తరించి ఉందని అన్నారు. ప్రధాన ఆలయం, కమ్యూనిటీ హాల్, రెండు చిన్న దేవాలయాలు, బ్రిడ్జి, పల్లె ప్రకృతి వనం, వేస్టేజ్ షేడ్లు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం కాంపౌండ్ వాల్, అభిషేక మండపం, వేదిక, డార్మిటరీలు, స్నానాల గదులు, టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. పార్ ఏర్పాటు చేసి సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. నేచురల్ షెడ్లు, పారింగ్ ఏరియా ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం బెంచీలు, హైమాస్ట్ లైట్లు, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాలయ అప్రోచ్ రోడ్డును అభివృద్ధి పరచాలన్నారు. పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, శివరాత్రిలోపు తీర్థాల దేవాలయ కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అధికారులు శ్రీనివాస్, సులోచన, దుర్గాప్రసాద్, రమణ, గణేశన్, హరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ధరణి నూతన మార్గదర్శకాలపై ఆ శాఖ అధికారులతో ఐడీవోసీలో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నూతన మార్గదర్శకాలపై అధికారులు పూర్తి అవగాహన పొందాలన్నారు. బృందాలు ఏర్పాటు చేసి దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, శిక్షణ కలెక్టర్లు మయాంక్సింగ్, యువరాజ్, వివిధ శాఖల అధికారులు విజయనిర్మల, హరికిషన్, సత్యనారాయణ, నాగలక్ష్మి, అరుణ, మీనన్, మదన్గోపాల్, సత్యనారాయణ, రాంబాబు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో వివిధ శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల పరిషారానికి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డీ.మధుసూదన్నాయక్ అధికారులకు సూచించారు. పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారం, పురోగతి అంశాలపై ఆయా శాఖల అధికారులతో ఐడీవోసీలో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల్లో టైం బాండ్ కేసులు, డైరెక్షన్లు, ధికార, రిట్ పిటిషన్లు ఉన్నట్లు తెలిపారు. వీటి పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు హరికిషన్, సోమశేఖరశర్మ, ఆంజనేయస్వామి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.