భద్రాచలం, ఫిబ్రవరి 20 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం సీతారాముల నిత్యకల్యాణం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, తదితర నిత్య పూజలు భక్తి ప్రపత్తులతో జరిపారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపి, భక్తులకు ప్రసాదాలు, శేషవస్ర్తాలను అందజేశారు.