జూలూరుపాడు, నవంబర్ 3: తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి మదన్లాల్ స్పష్టం చేశారు. ఇందుకోసం కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. జూలూరుపాడు మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. మండలంలోని వినోభానగర్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం వినోభానగర్, వీరభద్రాపురం, సూరారం, గుండెపుడి, రామచంద్రాపురం, నల్లబండ బోడు, గంగారంతండా, గాంధీనగర్, శంబునిగూడెం, అనంతారం, రామకృష్ణాపురం గ్రామాల్లో ప్రచార రథంపై ఉంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రపంచంలో ఏక్కడాలేని విధంగా రైతుబంధు పథకాన్ని తెచ్చిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. సీఎం కేసీఆర్ తెచ్చిన రైతుబీమా పథకానికి అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పుర్తయితే ఉమ్మడి జిల్లా పాడి పంటలతో సస్యశ్యామలమవుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు యల్లంకి సత్యనారాయణ, లావుడ్యా సోని, భూక్యా కళావతి, చావా వెంకటరామారావు, యదళ్లపల్లి వీరభద్రం, పోలుదాసు కృష్ణమూర్తి, దుద్దుకూరి నాగేశ్వరరావు, సాయిన్ని లక్ష్మణ్రావు, మంగముడి నాగేశ్వరరావు, నిమ్మటూరి కనకయ్య, యల్లంకి సత్యనారాయణ (వైఎస్), ధరావత్ నాగేశ్వరరావు, సాయిన్ని హరీశ్, కంచర్ల సూర్యప్రకాశ్, మాళోత్ నర్సింహారావు, హరిలాల్, రాములు తదితరులు పాల్గొన్నారు.