ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది. కార్మికులకు సింగరేణి సంస్థ తీపికబురు అందించింది. సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సింగరేణి యాజమాన్యం బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బదిలీ వర్కర్ జనరల్ మజ్దూర్గా మారాలంటే అదో పెద్ద ప్రహసనం. కనీసం ఆరేడేళ్లు పట్టేది. అది కూడా పైరవీలతోనే నడిచేది. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత బదిలీ వర్కర్ల పరిస్థితిని నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సంస్థ నిబంధనలు అనుసరించి జనరల్మజ్దూర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని సీఎండీ శ్రీధర్ను ఆదేశించారు. దీంతో అర్హత ఉన్న కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా ఉద్యోగోన్నతి లభించింది. సింగరేణి వ్యాప్తంగా 2,321 మంది బదిలీ వర్కర్లు జనరల్ మజ్దూర్లుగా ప్రమోషన్ పొందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీబీజీకేఎస్ ఇప్పటివరకు సుమారు 10వేల మందికి జనరల్ మజ్దూర్గా ప్రమోషన్ ఇప్పించి కార్మికుల పక్షపాతిగా నిలిచింది.
రామవరం, సెప్టెంబర్ 1: సింగరేణిలో ప్రస్తుతం బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులను బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా ప్రమోషన్ ఇస్తూ గురువారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులతో 2,321 మంది బదిలీ వర్కర్లు లబ్ధి పొందనున్నారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 10వేల మందికి జనరల్ మజ్దూర్ ప్రమోషన్ ఇచ్చింది. నియమ నిబంధనల ప్రకారం వంద లోపు మస్టర్లు మాత్రమే చేస్తే మూడేండ్లు వరుసగా అదే పద్ధతిలో కొనసాగితే డిస్మిస్ అయ్యే ప్రమాదం ఉంది. విధులకు ఎక్కువగా గైర్హాజరవుతున్న వారిని గుర్తించి యాజమాన్యం మూడు నెలలకు ఒక సారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నది. దీంతో కొంత హాజరుశాతం పెరుగుతుంది. కౌన్సిలింగ్లో పారిశ్రామిక నిబంధనలు వివరించడంతో పాటు క్రమంగా విధులకు హాజరయ్యేలా సంక్షేమాధికారులు, పర్సనల్ డిపార్ట్మెంట్ వారు కృషి చేస్తున్నారు. యాజమాన్య నిబంధనల ప్రకారం 31-12-2021 వరకు ఉద్యోగం పొంది ఏదైనా ఒక ఏడాదిలో అండర్ గ్రౌండ్లో 190 మస్టర్లు, 240 సర్ఫేస్ మస్టర్లు పూర్తి చేసుకున్న వారికి జనరల్ మజ్దూర్ నియామక పత్రాలు అందనున్నాయి.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా..
సీఎం కేసీఆర్ చొరవతోనే కారుణ్య నియామకాల్లో భాగంగా నాకు ఉద్యోగం నాకు వచ్చింది. 2019 ఆగస్టు 28న నేను విధుల్లో చేరాను. గతం లో బదిలీ వర్కర్ జనరల్ మజ్దూర్ కావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టేది. కానీ కేసీఆర్ కృషి తో నేను జనరల్ మజ్దూర్ అవుతున్నాది. కేసీఆర్తో పాటు యూనియన్కి రుణపడి ఉంటా.
– మారెపల్లి వేణుగోపాల్, జనరల్ మజ్దూర్, కొత్తగూడెం ఏరియా
ఊహించనే లేదు..
గతంలో జనరల్ మజ్దూర్ కావాలంటే సంవత్సరాలు పట్టేది. కానీ మేం అదృష్టవంతులం. 190 మస్టర్లు చేసి నేను జనరల్ మజ్దూర్ అవుతున్నా. ఇక నేను ఇంటర్నల్ పరీక్షలు రాసుకునేందుకు అర్హుడిని. కారుణ్య నియామకాల్లో భాగంగా నాకు నాన్న ఉద్యోగం వ చ్చింది. ఉద్యోగం రావడమే సంతోషం అనుకుంటే తొందరలోనే జనరల్ మజ్దూర్ కావడం మరింత సంతోషాన్నిచ్చింది.
– మేకల నరేశ్, జనరల్ మజ్దూర్, పీవీకే 5 ఇైంక్లెన్, కొత్తగూడెం ఏరియా
ఇప్పటివాళ్లు అదృష్టవంతులు
గతంలో ఆరు నుంచి ఏడేళ్లు పనిచేస్తే తప్ప జనరల్ మజ్దూర్ ప్రమోషన్ వచ్చేది కాదు. ఇప్పటి వాళ్లు అదృష్టవంతులు. కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందడమే కాకుండా 190 మస్టర్లు చేయడంతోనే జనరల్ మజ్దూర్ అవుతున్నా.
– ఈర్ల సత్యనారాయణ, మాజి సింగరేణి ఉద్యోగి
టీబీజీకేఎస్ విజయం ఇదీ..
ఇది ముమ్మాటికీ టీబీజీకేఎస్ విజయమే. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘమైన తర్వాత ఎన్నో హక్కులు సాధించుకున్నాం. ఇప్పటివరకు సుమారు 10వేల మందికి జనరల్ మజ్దూర్గా ప్రమోషన్ను కల్పించిన ఘనత టీబీజీకేఎస్ది.
– ఎండీ రజాక్, కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్