ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం 7వ రోజు చేరుకున్నాయి. అమ్మవారు శ్రీకనకదుర్గాదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో చంఢీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల కృష్ణమోహన్శర్మ, ఆలయ సూపరిండెంట్ బీ.శ్రీనివాస్, ప్రధాన అర్చకులు యు.శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.