ఖమ్మం: మహిళలు అభివృద్ధి చెందాలంటే ప్రతీ ఒకరూ చదువుకోవాలని ప్రోత్సహించి వారి అభివృద్ధికి కృషి చేసిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కొనియాడారు. సోమవారం ఆమె జయంతి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఖమ్మం తెలంగా భవన్లో, పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ ఆర్జేసీ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం మారెట్ కమిటీ చైర్ పర్సన్ డి.లక్ష్మీప్రసన్న, డిసిసీబి చైర్మన్ కురాకుల నాగభూషణం, పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు అతిధులుగా హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పింటంతో పాటు వివిధ రంగాల్లో తమ ప్రతిభ కనబరిచి ఉన్నత పదవుల్లో ఉన్న పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు.
అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ మహిళలు ప్రస్తుత సమాజంలో వివిధ హొదాల్లో కొనసాగేందుకు ఆనాడు పూలే మహిళా లోకంలో నింపిన చైతన్య మే కారణం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని దీనిలో భాగంగానే తన మంత్రి వర్గంలో మహిళ కు స్థానం కల్పించడంతో పాటు,వారి అభివృద్ధి కోసం పలు పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు.పూలే ఆశయాల సాధన కు ప్రతీ ఒకరు కృషి చేయాలని, అదే ఆమెకు అర్పించే నివాళి అని పేరొన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ అనుబంధ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్,ఖమ్మం కార్పొరేషన్ కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న,సుడా డైరెక్టర్ కొల్లు పద్మ,దిశ కమిటీ సభ్యురాలు మేదరి మెట్ల స్వరూపా రాణి,ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత భారతీ రాణి,మలిదశ టిఆర్ ఎస్ ఉద్యమ కారుడు పగడాల నరేందర్, మహిళా విభాగం నగర అధ్యక్షులు తన్నీరు శోభారాణి,బిసి విభాగం నగర అధ్యక్షులు మేకల సుగుణా రావు,యువజన విభాగం నగర ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్, మైనార్టీ విభాగం నగర అధ్యక్షులు శంశుద్దీన్ లతో పాటు పలువురు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.