ఖమ్మం, జూలై 3 : రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఎంపీ బండి పార్థసారథిరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం భేటీ అయ్యారు.
ఎంపీగా పార్లమెంట్లో ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారిగా తన ఇంటికి వచ్చిన పార్థసారథిరెడ్డికి వద్దిరాజు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మర్యాదపూర్వకంగా వద్దిరాజును కలిసినట్లు వారు పేర్కొన్నారు.