వేంసూరు, ఏప్రిల్ 16 : కేంద్రం ఎఫ్సీఐని నిర్వీర్యం చేస్తున్నదని, రాష్ట్రంలో రైతులెవరూ అధైర్యపడాల్సిన పని లేదని, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోనే రైతుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, రైతులు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ కల అని అన్నారు. ప్రజలందరికీ ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఆనాడు పెద్దలు ఎఫ్సీఐని నెలకొల్పారని, దురదృష్టం కొద్దీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు తక్కెళ్లపాటి
గోపాలకృష్ణ, సర్పంచ్ ఎండీ.ఫైజుద్దీన్, పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ వనమా వాసు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంత శ్రీమంతుడు బండి హెటిరో అధినేత, కందుకూరి వాసి, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి మన ప్రాంత శ్రీమంతుడని ఎమ్మెల్యే సండ్ర కొనియాడారు.
మొద్దులకాలువ అభివృద్ధి పనులకు తన సొంత నిధులు రూ.10లక్షలు వెచ్చించగా.. ఆదివారం ఎమ్మెల్యే సండ్ర మొద్దుకాలువ పనులకు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మొద్దుకాలువ పూర్తయితే దళిత రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, గొర్ల ప్రభాకర్రెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, సర్పంచ్లు బూరుగు నాగేశ్వరరావు, మందపాటి వేణుగోపాల్రెడ్డి, ఎంపీటీసీ కొమరవరపు భూలక్ష్మీ, సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కళాశాల బాధ్యులు దాసరి ప్రభాకర్రెడ్డి, మందపాటి మహేశ్వరరెడ్డి, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎంపీటీసీని పరామర్శించిన ఎమ్మెల్యే బీమవరం ఎంపీటీసీ నున్నా రాంబాబును ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే సండ్ర పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్ యర్రా రమేశ్, పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, సీడీసీ డైరెక్టర్ పుచ్చకాయల శంకర్రెడ్డి, ఎంపీటీసీ గొర్ల శ్రీనివాసరెడ్డి, గండ్ర సోమిరెడ్డి, దొడ్డా వెంకటకృష్ణారెడ్డి, నూనె హరిబాబు తదితరులు ఉన్నారు.