ఖమ్మం, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో గురువారం బస చేశారు.
బుర్హాన్పురంలోని ఆయన నివాసానికి చేరుకున్న స్వామికి రవిచంద్ర కుమారులు వద్దిరాజు నిఖిల్, నాగరాజు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారిని పలువురు నగర ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య, సాయి, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.