భోగి మంటలు..
తీరొక్క రంగవల్లులు..
అందులో గొబ్బెమ్మలు..
హరిదాసు కీర్తనలు..
బొమ్మల కొలువులు..
ఎగిరిన పతంగులు..
ఇలా.. పిల్లలంతా సంక్రాంతి సంబురాలతో సందడి చేశారు. ‘సంక్రాంతి.. ఆదివారం కదా..!’ అనుకుంటున్నారా..!! అందరికీ ఆరోజు పం డుగ. కానీ, నగరంలోని స్కూల్ పిల్లలు మాత్రం ముందస్తుగా గురువారమే వేడుక చేసుకున్నారు. విద్యాసంస్థలకు శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు ఉండడంతో పిల్లలంతా నిన్న తమ తమ పాఠశాలల్లో పండుగ చేసుకున్నారు. భోగి మంటలు వేసి, రంగవల్లులు తీర్చిదిద్ది, గొబ్బెమ్మలను చేర్చి, హరిదాసు కీర్తనలు పాడుతూ.. బొమ్మలు పేర్చి.. పతంగులు ఎగురవేసి సందడి సందడి చేశారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 12: నగరంలోని ప్రైవేట్ పాఠశాలల్లో గురువారం సంక్రాంతి వేడుక లు జరిగాయి. శ్రీవిద్యానికేతన్ సీబీఎస్ పాఠశాలలో డైరెక్టర్ గొల్లపూడి రాంప్రసాద్; హార్వెస్ట్ టెండర్ రూట్స్, స్ప్రింగ్ లీఫ్ పాఠశాలల్లో కరస్పాండెంట్ పోపూరి రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతిరెడ్డి; త్రివేణి పాఠశాలలో అధినేత యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్; శ్రీ చైతన్య పాఠశాలలో చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య; ఎస్వీఎం, సర్వజ్ఞ స్కూల్లో డైరెక్టర్లు రాజా వాసిరెడ్డి నాగేంద్రకుమార్, నీలిమ; రెజోనెన్స్ ఇన్ఫోలో డైరెక్టర్లు కొండా శ్రీధర్రావు, కృష్ణవేణి; ప్రిన్సిపాల్ ప్రసన్నరావు; ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపాల్ కొత్తూర్ స్వప్న, చైర్మన్ రవీందర్రెడ్డి, చైర్పర్సన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రఘునాథపాలెం, జనవరి12: బల్లేపల్లిలోని బ్లూమింగ్ మైండ్స్ సెంట్రల్ స్కూల్లో చైర్మన్ డాక్టర్ సత్యనారాయణరెడ్డి, కరస్పాండెంట్ పి.అశోక్రెడ్డి, ప్రిన్సిపాల్ వి.కిరణ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ జి.ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.