ఖమ్మం :పంటల పెట్టుబడి సొమ్ము అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు ఆరాద్య దైవం అయ్యాడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం నగర హోల్సేల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతుబంధు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలిసి మంత్రి పువ్వాడ హజరయ్యారు.
వేడుకలకు విచ్చేసిన మంత్రులకు రైతులు ఘనస్వాగతం పలికారు. యాబై క్వింటాల ఉద్యానపంటలతో తయారు చేసిన సీఎం కేసీఆర్ పద్దెనిమిది వందల అడుగుల చిత్రపటాన్ని వారు పరిశీలించి, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూష్పాబిషేకం, పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ రైతుబంధు పథకం చరిత్రాత్మకమని, లక్షలలాది మంది రైతులను ఆదుకుంటున్న పథకం అని అన్నారు. పంట పెట్టుబడి సైతం ప్రభుత్వమే ఇవ్వాలని నిర్ణయించిన మహా నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.
ఒక్కటి కాదు, రెండు కాదు యాబై వేల కోట్ల రూపాలయలు పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం పట్ల సర్వత్రా హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. విత్తనం నుంచి మొదలు కొని మార్కెట్లో మద్దతు ధరలు వచ్చే వరకు సహకరిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అవినీతి, అవగాహన లేని నాయకులు తెలంగాణకు వచ్చి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు సీఎం కేసీఆర్ను విమర్శించడం సరికాదన్నారు. కళ్లు ఉండి చూడలేని కబోదులకు, అభివృద్ది ఎలా కనడుతుందని మంత్రి దుయ్యబట్టారు.