ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ లోని రైతుబజార్లో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇల్లందు క్రాస్రోడ్ లోని రైతు బజార్లో వినియోగదారులకు సక్రమైన పద్దతిలో సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఏడేండ్లుగా వినియోగదారుల మన్ననలు పొందుతూ ముందకు సాగుతుందన్నారు.
వివిధ రకాల కూరగాయాలను పండించే రైతులు సరసమైన ధరలకు ప్రజలకు కూరగాయాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, స్రెటరీ మల్లేశం, రామకృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, డీఈ సమాధానం, ఏఈ సుబ్బయ్య,. ఏస్టేట్ అధికారులు పద్మ, శ్వేతా, శివరామకృష్ణ, రైతు కమిటీ సభ్యులు రామారావు, గిరి, పాషా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.