ఖమ్మం : వరంగల్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ నెట్బాల్ బాలికల, బాలుర విభాగాల్లో జిల్లా జట్టు మొదటి, రెండో స్ధానంలో నిలిచేందుకు ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి, జట్టు గెలుపునకు కృషి చేసినట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. ఈ జట్టులో ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్, ఎస్బీఐటీ, కిట్స్ కళాశాల విద్యార్థులు ఉన్నారన్నారు. విద్యార్థులను అభినందించిన వారిలో ఫణికుమార్, దీప్తి, భాను, అఖిల తదితరులున్నారు.