ఖమ్మం రూరల్, ఏప్రిల్ 12 : రైతుల నుంచి సేకరించిన ఖరీఫ్ ధాన్యం నిల్వలను నిర్ణీత గడువులోగా మరాడించి బియ్యంను ఎఫ్సీఐకి తరలించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం మంగళగూడెంలోని సత్యనారాయణ సిల్కి రైస్ మిల్లును తనిఖీ చేసిన అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు.
మరాడించిన బియ్యంను భారత ఆహార సంస్థకు చేరవేసే విధంగా మిల్లర్లు జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించని మిల్లర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.