చింతకాని, ఏప్రిల్ 2: “కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలే. ఆ పార్టీకి ఓట్లేసిన ప్రజలు.. ఇవన్నీ చూస్తూ, పునరాలోచనలో పడ్డారు” అని, బీఆర్ఎస్ నేతలైన ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. బీఆర్ఎస్ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం ప్రోద్దుటూరు గ్రామంలో జరిగింది. వారు మాట్లాడుతూ.. అబద్ధపు, అసాధ్యపు హామీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మాయచేసి అధికారంలోకి వచ్చిందని, కేవలం 100 రోజుల్లోనే చేతులెత్తేసిందని అన్నారు. “కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హమీలే మనకు శ్రీరామరక్ష.” అని, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. పదేళ్ళలో లేని కరువు 100 రోజుల్లోనే వచ్చిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
పాలేరులో నీరు అడుగంటడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, పార్టీ నాయకులు పెంట్యాల పుల్లయ్య, తిరుపతి కిషోర్, గడ్డం శ్రీనివాసరావు, మంకెన రమేష్, వేముల నర్సయ్య, నూతలపాటి వెంకటేశ్వర్లు, పఠాన్ షబ్బీర్ఖాన్, బోగ్గారపు రాంబాబు, బండి రామారావు, తిరుపతి కొండలు, తుడుం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.