కొత్తగూడెం టౌన్, జనవరి 14: ఉమ్మడి జిల్లావాసులు ఆదివారం ఘనంగా భోగి పండుగ నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి చిన్నాపెద్దా వీధుల్లో భోగి మంటలు వేశారు. మంటల్లో వంట చెరకు,పిడకలతోపాటు ఇంట్లో మూలన పడిన పాత వస్తువులు, ఫర్నీచర్ను దహనం చేశారు. మహిళలు ఇంటి ముందు రంగవల్లులు వేశారు. వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టారు. గోమాతకు పూజలు నిర్వహించారు. కొందరు ఇంట్లో బొమ్మల కొలువు పెట్టి బంధుమిత్రులను ఆహ్వానించారు. తమ పిల్లలపై భోగి పండ్లు పోయించారు. తమ ఆలయాలకు వెళ్లి ఇష్టదేవతలకు పూజలు చేశారు.