ఖమ్మం : జిల్లాలో నిరుద్యోగ యువత ఎంప్లాయిమెంట్ కార్డులు ఉండి గడువుతీరిన (లాప్స్ అయిన)కార్డులను పునరుద్ధరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిదని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కొండపల్లి శ్రీరామ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంప్లాయిమెంట్ కార్డ్ పొంది వివిధ కారణముల వలన రెన్యూవల్ చేసుకోలేక పోయిన అభ్యర్ధులకు తెలంగాణా రాష్ట్ర కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ పునరుద్ధరణకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు 45 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నవారికి పునరుద్దరించుకునేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఎంప్లాయిమెంట్ కార్డు ఉన్న వారికి ఈ నెల 31వ తేది వరకు అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అభ్యర్థులు తమ కార్డులను రెన్యువల్ చేసుకోవడానికి తమ ఒరిజినల్ ఎంప్లాయిమెంట్ కార్డ్, కులం, ఆధార్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో ఎంప్లాయిమెంట్ పోర్టల్లో రెన్యువల్ రిస్టోరేషన్ ఆప్షన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు https // employment.telangana.gov.in ద్వారా ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. గిరిజన అభ్యర్థులు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా ఉపాధికల్పానాధికారి సెల్ నెం.9849557187లో సంప్రదించాలని కోరారు.